కురవి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

కురవి ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ) : మహాశివరాత్రి ఉత్సవాల సందర్బంగా ఈ నెల 17 నుంచి 18 వరకు కురవిలో జరిగే శ్రీవీరభద్రస్వామి జాతరకు మహబూబాబాద్‌ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. మహబూబాబాద్‌ నుంచి కురవికి 16 బస్సులు, కురవి నుంచి ఖమ్మం 4, కురవి నుంచి మరిపెడకు 4, కురవి నుంచి జంగిలిగొండకు రెండు బస్సులు నడుపుతామన్నారు. మహబూబాబాద్‌ నుంచి పెద్దలకు రూ.10, పిల్లలకు రూ.5 ఛార్జీ తీసుకుంటామన్నారు. జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ప్రయాణించాలన్నారు.