కేసీఆర్కు దమ్ముంటే..
ముందస్తు ఎన్నికలకు రావాలి
– కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా తెరాస సభ
– ముస్లీం, గిరిజన రిజర్వేషన్లపై మోడీని ఎందుకు అడగడం లేదు
– 15రోజుల్లో 500పైగా రైతులు చనిపోయారు.
– రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి
– విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్
కరీంనగర్, సెప్టెంబర్3(జనం సాక్షి) : ప్రగతి నివేదన సభలో హంగామా తప్ప ఏవిూలేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ప్రగతి నివేదన సభ ఉందని ఎద్దేవా చేశారు. మోదీ దగ్గర మోకరిల్లుతున్నది కేసీఆరే అని పొన్నం వ్యాఖ్యానించారు. ముస్లిం, గిరిజన రిజర్వేషన్లపై మోదీని ఎందుకు అడగటంలేదని ప్రశ్నించారు. విభజన హావిూలు ఎందుకు సాధించలేకపోయారని నిలదీశారు. దమ్ముంటే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. పత్రికలకు ముందస్తు ఎన్నికలంటూ లీకులిచ్చి ఇప్పుడేమో మ్యానిఫెస్టో కమిటీ త్వరలో వేస్తానంటున్నారని పొన్నం మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని పొన్నం స్పష్టం చేశారు. సభ అట్టర్ ఫ్లాప్ అయిందనడానికి సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో నుంచి తీసిని ఏరియల్ వ్యూ విజువల్సే సాక్ష్యమన్నారు. విరసం నేత వరవరరావు అరెస్ట్పై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని కేసీఆర్ను ప్రశ్నించారు. ఢిల్లీ దగ్గర మోకరిల్లుతామని మమ్మల్ని విమర్శిస్తున్న కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర మోకరిల్లడం లేదా అని ప్రశ్నించారు. ఫెడరల్ విధానంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఎంతో కీలకమని తెలిపారు. ప్రధాన మంత్రిని ‘ఇస్తావా చస్తావా’ అని బెదిరించి జోనల్ విధానాన్ని సాధించానని చెబితే నవ్వొచ్చిందన్నారు. ఇదే మాట నాలుగేళ్ల కింద ఎందకడగలేదని నిలదీశారు. ముస్లిం, గిరిజిన రిజర్వేషన్లపై ఇదే తరహాలో మోదీని ఎందుకు అడగడం లేదన్నారు. విభజన హావిూలు ఎందుకు సాధించలేక పోయావని ప్రశ్నించారు. రాష్ట్రంలో 15 రోజుల్లోనే 500 పైగా రైతులు చనిపోయారని, రాష్ట్రంలో హెల్త్ ఎమ్మెర్జెన్సీ ప్రకటించాలని పొన్నం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విద్యుత్ ఉద్యోగులకు జీతాలు పెంచిన కేసీఆర్.. హరీశ్ రావు గౌరవ
అధ్యక్షుడిగా ఉన్నందుకే ఆర్టీసీ కార్మికులకు వేతనాలు పెంచడం లేదా అని పొన్నం ప్రశ్నించారు. ఇసుకపై అత్యధిక ఆదాయం వచ్చిందంటున్న కేసీఆర్… ఇసుక అక్రమ రవాణాపై మాట్లాడాలని పొన్నం డిమాండ్ చేశారు.



