కొండమల్లేపల్లి లో AITUC నల్గొండ జిల్లా మహాసభలు పల్లా దేవేందర్ రెడ్డి

నవంబర్ 13వ తేదీన కొండమల్లేపల్లి లో జరిగే ఏఐటియుసి నల్లగొండ జిల్లా పదవ మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్ర వారం కొండ మల్లేపల్లి లో జరిగిన AITUC జిల్లా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం ఏఐటియుసి నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు .కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను మారుస్తూ పెట్టుబడిదారుల కొమ్ముకాస్తుందని దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానం తిప్పికొట్టేందుకు కార్మిక లోకం పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నయని దాని వల్ల కార్మికుల జీవితాలు దుర్బరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులకు రక్షణ చట్టాలు కల్పించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 13వ తేదీ కొండమల్లే పెల్లి లోనీ వి వి ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగే జిల్లా పదో మహాసభlలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు నల్పరాజు సతీష్ కుమార్ అధ్యక్షత వహించిగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చాపల శ్రీను, సహయ కార్యదర్శి నూనె రామస్వామి, ఉపాధ్యక్షులు ఎండీ సయీద్,నూనె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు