కొండ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకార నాయకులు

మెట్పల్లి, ఫిబ్రవరి 16, జనంసాక్షి:
మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండ స్వామి దేవాలయంలో మెట్ పల్లి విశ్వబ్రాహ్మణ స్వర్ణకార నాయకులు బుధవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజనలతో, భక్తి పాటలతో నినాదాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఇల్లెందుల కృష్ణమాచారి, బాజోజి శ్రీనివాస్, తిప్పర్తి వెంకటేశ్వర్లు, మండలోజు మనోహర్, ఇల్లెందుల శ్రీనివాస్, వెంకటేష్, మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు