కోదాడలో వేణుమాధవ్ నామినేషన్
ఒంటరిగానే పోరాటం అన్న నటుడు
కోదాడ,నవంబర్19(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా సినీ హాస్య నటుడు వేణుమాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. మూడు రోజుల క్రితం నామినేషన్ వేసేందుకు వచ్చిన వేణుమాధవ్ తగిన పత్రాలు సమర్పించకపోవడంతో వాటిని అధికారులు తిరస్కరించారు. దీంతో నామినేషన్లకు చివరిరోజైన సోమవారం తన మద్దతు దారులతో మరోసారి వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. కోదాడ తన స్వస్థలం కావడంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నట్లు వేణుమాధవ్ తెలిపారు. తను ఏ పార్టీ న ఉంచి టిక్ఎట్ కోరలేదని, నేరుగా ప్రజలనే మద్దతు కోరుతానని
అన్నారు. ఇక్కడి కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ భార్య పద్మావతి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేసి గెలుపొందారు.