కోర్టు తీర్పును గౌర‌విస్తాం: ఐపీఎల్ చైర్మ‌న్ శుక్లా

shukla

న్యూఢిల్లీ: బీసీసీఐలో సంస్క‌ర‌ణ‌ల‌పై సుప్రీంకోర్టు తీర్పును తాము గౌర‌విస్తామ‌ని ఐపీఎల్ చైర్మ‌న్ రాజీవ్‌శుక్లా అన్నారు. లోధా క‌మిటీ సిఫార‌సుల‌ను ఎలా అమ‌లుచేయాల‌న్న‌దానిపై దృష్టిసారిస్తామ‌ని తెలిపారు. లోధా క‌మిటీ సిఫార‌సుల్లో ఒక రాష్ట్రానికి ఒకే ఓటు, ఆఫీస్ బేర‌ర్స్‌లో 70 ఏళ్ల వ‌య‌సు మించిన వాళ్లు ఉండ‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌ల‌ను గ‌తంలో బోర్డు తీవ్రంగా వ్య‌తిరేకించింది. అయితే మార్పును క‌చ్చితంగా బోర్డు అంగీక‌రించాల‌న్న కోర్టు తీర్పు నేప‌థ్యంలో వాటిని ఎలా అమ‌లు చేస్తుంద‌న్న ఆస‌క్తి నెల‌కొంది.