కోల్‌కతాలో బాంబు పేలుడు

హైదరాబాద్:పశ్చిమబెంగాల్ కోల్‌కతాలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఉత్తర కోల్‌కతాలోని తలా ట్యాంక్ ఏరియాలో జరిగిన బాంబు పేలుడుతో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలంలో మరో రెండు బాంబులను పోలీసులు గుర్తించారు. అనంతరం వాటిని నిర్వీర్యం చేశారు. బాంబు పేలుడుతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గుర్యయారు.