కోల్‌కతా: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ కాస్త దూకుడుగానే ఆడుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీకి ఓపెనర్లు కరుణ్‌నాయర్‌, సంజు శాంసన్‌ శుభారంభం ఇచ్చారు. 7 ఓవర్లు ముగిసే సమయానికి దిల్లీ వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసింది. 4.5వ ఓవర్‌ వద్ద నరైన్‌ బౌలింగ్‌లో కరుణ్‌ నాయర్‌ (15) ఎల్బీ రూపంలో మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం క్రీజులో శాంసన్‌(36), శ్రేయస్‌ అయ్యర్‌ (3) ఉన్నారు.

కోల్‌కతా: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ కాస్త దూకుడుగానే ఆడుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీకి ఓపెనర్లు కరుణ్‌నాయర్‌, సంజు శాంసన్‌ శుభారంభం ఇచ్చారు. 7 ఓవర్లు ముగిసే సమయానికి దిల్లీ వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసింది. 4.5వ ఓవర్‌ వద్ద నరైన్‌ బౌలింగ్‌లో కరుణ్‌ నాయర్‌ (15) ఎల్బీ రూపంలో మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం క్రీజులో శాంసన్‌(36), శ్రేయస్‌ అయ్యర్‌ (3) ఉన్నారు.