*కోళ్లలోడుతో వెళ్తున్నా వాహనం బోల్తా

దేవరుప్పుల సెప్టెంబర్ 14 (జనం సాక్షి):* దేవరుప్పుల మండలం,ధర్మగడ్డ తండా వద్ద కోళ్ల లోడుతో వెళ్తున్న ఏపీ 03 టి ఏ 8174 గల టాటా వాహనం  అదుపు తప్పి బోల్తా  పడింది.సిద్దిపేట నుండి  అనకాపల్లి జిల్లాకు కోళ్ల లోడు తో వెళ్తున్న సమయంలో వాహనానికి ఆటోమేటిగ్ గా గేర్లు పడడంటతో అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదం లో డ్రైవర్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు.కానీ వాహనంలో ఉన్న 1650 కోళ్లు రోడ్డుపాలు కాగా అందులో 80శాతం కోళ్లు చనిపోయాయి.దాదాపు 10లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని డ్రైవర్ అంటున్నాడు.