క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు

క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 19 :
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో మున్సిపల్‌ పరిధిలోని బోయిన్‌పేటకు చెందిన ఆకుల భవాని శంకర్‌ స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్‌ టోర్నమెంట్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ప్రారంభించారు. ఆకుల భవాని శంకర్‌ ఇటీవల మృతి చెందగా ఆయన స్మారకార్థం క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఏర్పాటుచేయగా ముఖ్యఅథితిగా హజరైన బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ క్రికెట్‌ ఆడి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. అంతకు ముందు క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడల్లో రాణిస్తూ జిల్లా, రాష్ట్రస్థాయికి ఎదుగాలని ఆకాంక్షించారు.