ఖమ్మం జిల్లాలో ప్రచారం
బిజెపి అభ్యర్తికి మద్దతుగా పరిపూర్ణానంద ప్రచారం
ఖమ్మం,నవంబర్ 26(జనంసాక్షి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రచారంలో అభ్యర్థులు జోరు పెంచారు. ఊరూరా తిరుగుతూ ప్రచారం చేపట్టారు. భధ్రాధ్రికొత్తగూడెం జిల్లా పినపాక నియేజక వర్గ మహకూటమి బలపర్చిన కాంగ్రెస్ పార్టి అబ్యర్ది రేగా కాంతారావు అశ్వాపురం మండలం కళ్యాణ పురం నుంచి రోడ్డు షొ ప్రారంబించారు. వీరికి గ్రామ గ్రామా పూల మాలలతొ సత్కరించి హవానించి స్వాగతం పలికారు. మండల వ్యాప్తంగా పర్యటించి చేతి గుర్తు విూ అముల్యమైన ఓటు వేసి అత్యధిక మేజార్టీతో గెలిపించాలని ప్రజలను కొరినారు. ఈ కార్యక్రమంలో మహకూటమి నాయకులు కాంగ్రెస్ నుంచి కొడి అమరేందర్,వెన్న అశోక్ దైద
నారాయణ రెడ్డి, కంచుకట్ల వీరబద్రం, రామచంద్రయ్య తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
వైరా పట్టణంలో వైరా నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి బలపరిచిన సిపిఐ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బాణోత్ విజయకంకి కొడవలి గుర్తుకు ఓటు వేయాలని సిపిఐ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున ప్రచారం చేపట్టారు. అసెంబ్లీ అభ్యర్థి బాణోత్ విజయ, సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి భాగం హేమంత్ రావు, కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పువ్వాళ దుర్గ ప్రసాద్, టీడీపీ వైరా మండల కార్యదర్శి చేరుకూరి చలపతిరావు పాల్గొన్నారు. భధ్రాధ్రికొత్తగూడెం జిల్లా పినపాక నియేజకవర్గంలొ బిజెపి అభ్యర్థి చందా సంతొష్ ఎన్నికల ప్రచారంలో పరిపూర్ణ నందస్వామి పాల్గొన్నారు. మణుగూరు మండలానికి వచ్చిన ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి పూలమాలలతొ సత్కరించారు.అంబెడ్కర్ విగ్రహానికి తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి మణుగూరు సెంటర్లొ ప్రచారం చేసినారు. ఈ కార్యక్రమంలో హమరనాద్. చందాలింగయ్య,. కుంజా బిక్షం బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి .రాఘవేంద్రరావు. ఏ నుగుల వేంకటరెడ్డి .నాయకులు కార్య కర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.