ఖానాపూర్ పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతా…

-ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్
ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 11(జనం సాక్షి): ఖానాపూర్ పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతానని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖ శ్యామ్ నాయక్ అన్నారు. శుక్రవారం ఖానాపూర్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో 20 లక్షలతో నిర్మించే నూతన డ్రైనేజ్ నిర్మాణానికి ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్  భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఖానాపూర్ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు రోడ్డు వెడల్పు డ్రైనేజ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్ నీ ఆదేశించారు.ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురువతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఖానాపూర్ పట్టణాన్ని మున్సిపల్ గా చేసుకొని సీఎం కెసిఆర్ మంత్రి కేటీఆర్  సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.అనంతరం భారత దేశ మొదటీ విద్య శాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్ కౌన్సిలర్లు పరిమి లత సురేష్,కావాలి సంతోష్,కూర్మ శ్రీను,నాయకులు, ప్రజా ప్రతినిధులు రాథోడ్ రాము,పుప్పాల శంకర్,గొర్రె గంగాధర్, తాల్లపెల్లి రజగంగన్న, తూము చరణ్,జన్నారపు శంకర్,మున్సిపల్ కమిషనర్ రత్నాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.