గంజాయి స్వాధీనం

మేడిపల్లి – జనంసాక్షి
ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని చెంగిచర్ల చెరువు (లేక్ ) దగ్గర ఒక వ్యక్తి అనుమానంగా సంచరిస్తుండగా మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ అదేశాలు మేరకు తనిఖీ చేశారు. అతని వద్ద ఉన్న బ్యాగ్ ను చెక్ చేయగా అందులో 63 ప్లాస్టిక్ డబ్బాలు, గంజాయితో తయారు చేసిన ఆయిల్ నింపి వున్నాయి. మొత్తం 447 ఎంఎల్ హశిష్ అయిల్ ని సీజ్ చేసి వెంటనే  అక్రమంగా గంజాయి రవాణా, అమ్మడం,  కలిగిఉండడం నేరమని అతని వద్ద లభించిన వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. సిఐ మల్లయ్య, సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అరకులోని గుర్తు తెలియని వ్యక్తి వద్ద లెటర్ 60వేలకు కోనుగోలు చేసి మేడిపల్లి, బోడుప్పల్ లోని వివిద వ్యక్తులు కు చిన్నచిన్న బాక్స్ లు ఒక్కో బాక్స్ 2,000 కు అమ్ముతున్నట్టు తెలిపాడు. నిందితుడిని ద్వారపుడి గోపి సాయి,  విశాఖపట్నంకు చెందినవాడిగా గుర్తించారు. ఎన్ డిపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి గౌరవ కోర్ట్ ద్వారా రిమాండ్ చేశారు. ఈ దాడులలో సిఐ మల్లయ్య, ఎస్సై  పురుషోత్తమ్ రెడ్డి, ఎస్సై శ్రావణి, సిబ్బంది పాల్గొన్నారు.