గడపగడపకు గ్యారెంటీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఈనెల 18 బుధవారం నుంచి చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల హామీకి సంబంధించిన కార్డులను పంపిణీ కార్యక్రమం గడప గడపకు గ్యారంటీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సుందిళ్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు కోరారు. ఆదివారం సుందిళ్ల గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. గ్రూపులు, విభేదాలు వీడి మంథని ఎమ్మెల్యేగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గెలుపే లక్ష్యంగా, సుందిళ్ల జిపి పరిధి నుంచి భారీ మెజార్టీ అందించడమే ద్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జనగామ కృష్ణ, జనగామ బుచ్చిబాబు, ఊట్ల గోపాల్ రెడ్డి, మార్క స్వామి, గడ్డం సది, ముస్కుల నరేందర్ రెడ్డి, రేకుంట్ల రవి, కోరు కొప్పుల తిరుపతి, ఈగ ప్రశాంత్, వేముల సతీష్, సౌత్కారి రవి, కోరు కొప్పుల మణికంఠ, మాటూరి లక్ష్మణ్, బోగిరి రవి, చిలక రాజనర్సు, జనగామ మల్లేష్, జనగామ కొమురయ్య, రామగిరి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు