గణపతి పూజలు అందుకున్న జడ్పీ చైర్మన్ కోరం

టేకులపల్లి, ఆగస్టు 31( జనం సాక్షి ): వినాయక చవితి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ఇల్లందు టేకులపల్లి ఉదయం నుండి సాయంత్రం వరకు పలు గణపతి మండపాలను సందర్శించి ప్రత్యేకంగా పూజలు అందుకున్నారు. ఇల్లందులో ముఖ్య అతిథిగా హాజరై నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం టేకులపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి సందర్శించి కొలువుదీరిన గణనాధుని మండపాలును ప్రారంభించారు. అనంతరం ఉత్సవ కమిటీ వారిని ప్రోత్సహిస్తూ భక్తిశ్రద్ధలతో నవరాత్రులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చొరవలు తీసుకుని నియమ నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహించాలని ఆయన కోరారు. ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.