గయా కోర్టులో లొంగిపోయిన ఎమ్మెల్సీ మనోరమా
జేడీయూ బహిష్కృత ఎమ్మెల్సీ మనోరమా బీహార్లోని గయా కోర్టులో లొంగిపొయారు. ఆమెకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అక్రమంగా తన ఇంట్లో మద్యం నిల్వచేసిందంటూ వారం రోజుల కిందట మనోరమపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అప్పటి నుంచి కన్పించకుండా పోయిన ఆమె.. ఎట్టకేలకు కోర్టుకు సరెండర్ అయ్యారు. ఓ యువకుడుని కాల్చిచంపిన కేసులో ఆమె కొడుకుతో పాటు భర్తను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.