గిరిజనుల సమస్యలపై సిపిఎం ధర్నా
విజయనగరం,అక్టోబర్28(జనం సాక్షి): కురుపాం తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం నేతలు సోమవారం ధర్నా నిర్వహించారు. రైతు భరోసా, గిరిజనులకు పోడు పట్టాలు, పక్కా ఇల్లు, ఉపాధి, జీడి మొక్కలు, పెండింగ్ బిల్లులు, పత్తి, మొక్కజన్న పంటలకు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం నాయకులు మండంగి శ్రీను, పువ్వల ధర్మారావు లు తహశీల్దార్ కు వినతిపత్రాన్ని అందచేశారు.