గీత వృత్తిదారులకు రాజకీయ పార్టీలు స్పష్టమైన హామీలివ్వాలి:డాకోళ్ల ఆంజనేయులు గౌడ్

గీత వృత్తిదారులకు రాజకీయ పార్టీలు స్పష్టమైన హామీలివ్వాలి:డాకోళ్ల ఆంజనేయులు గౌడ్

దౌల్తాబాద్ అక్టోబర్ 21, (జనం సాక్షి ).

గీత వృత్తిదారులకు వృత్తిరక్షణ,ఆధునీకరణ, నిధుల కేటాయింపుపై రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇవ్వాలని గౌడ సంఘం నాయకులు డాకోల్ల ఆంజనేయులు గౌడ్ డిమాండ్ చేశారు. చెట్టు పైనుంచి పడి మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని, వృత్తి పెన్షన్ గా నెలకు రూ.5000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వన పెంపకానికి ప్రతి సొసైటీకి పదెకరాల భూమిని కేటాయించాలని, ప్రతి గ్రామంలో కల్లుగీత సహకార సంఘానికి 1000 గజాల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. గీత వృత్తిదారుల కుటుంబాలకు విద్య,వైద్య పథకాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని అన్నారు. గీత వృత్తిదా రులకు గతంలో పేర్కొన్న పేర్కొన్నట్లు టూవీలర్స్, వృత్తి పరికరాలు అందించాలని కోరారు. కల్లుగీత వృత్తిని అభివృద్ధి చేయుటకు గీత వృత్తిదారులకు శిక్షణ, ఉపాధి కేంద్రాలని తాటి ఈతవనాలున్న చోట నెలకొల్పాల న్నారు