గుజ్రాల్‌ మృతికి సంతాపంగా పార్లమెంటు వాయిదా

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందర్‌కుమార్‌ గుజ్రాల్‌ మృతికి సంతాప సూచకంగా పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడ్డాయి. మాజీ ప్రధాని గుజ్రాల్‌ కన్నుమూసినట్టు కేంద్రహోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రకటించారు.