గురువారానికి రాజ్యసభ వాయిదా

న్యూఢిల్లీ : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశం రాజ్యసభను కుదిపేశాయి. ఈ ఉదయం ఇదే అంశంపై ఓ సారి వాయిదా అనంతరం మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌తో కూడిన చర్చకు పట్టుబట్టారు. సభ్యులు శాంతించకపోవడంతో ఛైర్మన్‌ సభను ఎల్లుండికి వాయిదా వేశారు.