గొల్లకురుమలకు గొర్రెల పంపిణీకి బదులు నగదు బదిలీ చేయాలి.

జెడ్పీటీసీ పత్తి నాయక్ కి వినతిపత్రం అందించిన గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం నాయకులు.

జనం సాక్షి, చెన్న రావు పేట

గొల్ల కురుమలకు రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీలో భాగంగా నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు చెన్నారావుపేట మండల జెడ్పీటీసీ పత్తి నాయక్ కి గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం (GMPS) చెన్నారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది,అనంతరం జిల్లా కమిటీ సభ్యుడు జక్క రవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా కార్యదర్శి పరికి మధుకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీలో భాగంగా నగదు బదిలీ మునుగోడు నియోజకవర్గంలో చేస్తుందని, అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా చెయ్యాలని అన్నారు.మన జిల్లాలో ఇప్పటి వరకు సగం మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ జరిగిందని, మిగతా సగం మంది లబ్ధిదారులకు నగదు బదిలి చేయాలని ఆయన అన్నారు. మొదటి విడతలో అనేక మైనటువంటి లోపాలు జరిగాయని,ఆ లోపాలను ఎండగట్టడానికి నగదు బదిలే ఏకైక మార్గమని ఆయన వివరించారు,ఈ కార్యక్రమం లో జెడ్పీటీసీ పత్తి నాయక్ మాట్లాడుతూ ఈ విషయంపై ఎమ్మెల్యేకు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి నా వంతు కృషి చేస్తానని గొల్ల కురుమలకు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జక్క రవి, మండల నాయకులు కుండే కుమారస్వామి, జక్క బాలయ్య, కడారి బీరయ్య, బండి సారయ్య ,పోతరాజు కొమురయ్య, మరాఠీ కరుణాకర్, దయ్యాల చీరలు, అమ్మ స్వామి ,సిద్ధూన శంకర్ , అమరగాని మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.