గోదావరి వంతెన వద్ద యువకుడు గల్లంతు

భద్రాచలం, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా గోదావరి వంతెన వద్ద స్నానానికి వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు, అతన్ని తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన యువకుడిగా అధికారులు గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు.