గ్రామపంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛభారత్

. నందిపేట్ (జనం సాక్షి )నవంబర్ 19. నందిపేట గ్రామపంచాయతీ ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్రపంచం మరుగుదొడ్డి దినోత్సవం పురస్కరించుకొని, స్వచ్చతా రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు .పంచాయతీ కార్యదర్శి సౌమ్య గ్రామపంచాయతీ సిబ్బంది కాలనీవాసులు చేత ,ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ కు కట్టుబడి ఉంటామని ,మా ఇంటిని మా కాలనీ పరిసర ప్రాంతాలను మేము పనిచేసే ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామని ,పరిసర ప్రాంతాలలో చెత్త వేయమని చెత్త వేయకుండా ఒకరినొకరం అవగాహన కల్పించుకుంటామని ప్రతి ఒక్కరు మరుగుదొడ్డిని వాడాలని మరుగుదొడ్ల వాడకం పరిసర ప్రాంతాలకే కాక మనమందరం శ్రేయస్కరమని ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు సమావేశాలు ఏర్పరచుకుంటామని స్వచ్ఛభారత్ కార్యక్రమంలో నూటికి నూరు శాతం విజయవంతం చేసేందుకు మా వంతు చూస్తామని అందరితో ప్రమాణం చేయించారు అనంతరం చేసి తొలగించారు. ఈ కార్యక్రమంలో నందిపేట ఉప సర్పంచ్ భారత్ కార్యదర్శి సౌమ్య గ్రామపంచాయతీ సిబ్బంది కాల్ మీ వార్తలు తదితరులు పాల్గొన్నారు.