ఘనంగా బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ జన్మదిన వేడుకలు.

జిల్లా ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేసిన బిసి పొలిటికల్ జేఏసీ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్19 (జనంసాక్షి):
బిసి పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ జన్మదినాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బిసి పొలిటికల్ జేఏసీ జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా స్థానిక జిల్లా ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బిసి పొలిటికల్ జేఏసీ జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి మాట్లాడుతూ రాచాల యుగంధర్ గౌడ్ బీసీలకై బీసీ రాజ్యాధికార సాధనకై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు. సమాజంలోని అసమానతలు చూసి బీసీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా సమాన హక్కులు విద్యా,ఉద్యోగ, ఆర్థిక రంగంలో,రాజ్యాధికారంలో వెనుకబాటతనం చూసి చలించిపోయిన అతను ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి బడుగు.బలహీన వర్గాల కోసం పోరాటానికై సిద్ధమైనారని తెలిపారు.  ఎన్నో పోరాటాలు చేసి బీసీ సామాజిక వర్గాల సమస్యల మీద పోరాటం చేస్తూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల నుండి ప్రశంసలు అందుకొని గొప్ప బీసీ నాయకుడు గా ఎదిగారని కొనియాడారు.ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని వారి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని మరి ఎన్నో ఉద్యమాలు చేసి బీసీల రాజ్యాధికార బావుట ఎగుర వేసే వరకు పోరాటాలు చేయాలని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవులు గౌడ్, రాము, కుమార్,మోహన్, నరేందర్, శ్రీకాంత్, దివాకర్ గౌడ్. ఆంజనేయులు. శ్రీనివాసులు. శ్రీకాంత్, రాజు యాదవ్ తదితరులు