ఘనంగా మహిళా ధూం ధాం

కదం తొక్కిన కళాకారులు
హైదరాబాద్‌, మార్చి 3 (జనంసాక్షి) :
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ఆదివారం ధూంధాం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కళాకారులు ఆటపాటలతో అలరించారు. తెలంగాణ ఆవశ్యకతను పాటల ద్వారా వివరించారు. దాండియా ఆట ఆకట్టుకుంది. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులు వేదికపై కంటతడి పెట్టారు. తెలంగాణ వచ్చేదాకా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని విమలక్క తెలిపారు. జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.