ఘనంగా మైసమ్మ తల్లి కి బోనాలు

బషీరాబాద్ జూన్ 24,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజున జయంతి కాలనీలో బుడగ జంగలు మరియు కోళ్ల ఫారంలో ఘనంగా మైసమ్మ తల్లి కి భోనాలు మరియు దీప నైవేద్యాలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలోని వాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.అమ్మవారిని  పిల్లాపాపలని గ్రామాన్ని చల్లగా చూడాలని కోరుకోని మొక్కులు తీర్చుకున్న మని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మరియు గ్రామ పెద్దలు, భక్తులు, తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.