చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి

– సీఎం జగన్‌ను ఉన్మాది అనడం సరికాదు
– సభలో పట్టుబట్టిన వైసీపీ సభ్యులు
– బాబు అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎథిక్స్‌ కమిటీ వేయాలి
– స్పీకర్‌ను కోరిన వైసీపీ సభ్యుడు ఆనం
– ఎథిక్స్‌ కమిటీకి రిఫర్‌ చేస్తానన్న స్పీకర్‌
అమరావతి, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని ప్రతిపక్షపక్ష నేత చంద్రబాబు ఉన్మాది అనడం సరికాదని, వెంటనే సభలో కక్షమాపణలు చెప్పాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. గురువారం ఉదయం సభలోకి వస్తున్న సమయంలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో బాబు ముఖ్యమంత్రి జగన్‌ను ఉన్మాది అని వ్యాఖ్యానించడంపై వైసీపీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని లేకపోతే.. ఎథిక్స్‌ కమిటీకి రిఫర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై టీడీపీ అభ్యంతరం తెలిపింది సభ బయట జరిగిన విషయానికి క్షమాపణ చెప్పమనడం ఏంటని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ ఉరి తీయాలని అన్నారని గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎథిక్స్‌ కమిటీ వేసి విచారణ చేయాలని స్పీకర్‌ను కోరారు. గతంలో జరిగిన ఇలాంటి ఘటనలు, వాటి పర్యవసానాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటివరకున్న సాంప్రదాయం ప్రకారం తాను చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, లేదా ఎథిక్స్‌ కమిటీ వేయమని స్పీకర్‌ను కోరారు. ప్రస్తుత చర్చల్లో వ్యక్తిగత దూషణలు, కుటుంబాల ప్రస్తావన, కులాలు, మతాలు, వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం లాంటి పరిణామాలు మంచివి కాదన్నారు. మనుషులన్నాక పొరపాట్లు చేస్తారని, ఈ విషయాన్ని చంద్రబాబు ఒప్పుకొని సభకు క్షమాపణ చెప్పాలని, లేదా మాటను వెనక్కి తీసుకోవాలని సూచించారు. లేకపోతే ఎథిక్స్‌ కమిటీ వేస్తే అందులోని సభ్యులే ఎవరిది తప్పో నిర్ణయిస్తారని పేర్కొన్నారు. సభ ఇలాగే కొనసాగితే సయమం? వృథా అవుతుండడంతో పాటు ప్రజా సమస్యలు చర్చకు రాకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్పందించిన స్పీకర్‌ క్షమాపణ చెప్పాలా? లేదా? అన్నది చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నా. క్షమాపణ చెప్పకపోతే ఎథిక్స్‌ కమిటీకి రిఫర్‌ చేస్తామని పేర్కొన్నారు. అంతకు ముందు టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. వైఎస్‌ బతినకున్నంత కాలం చంద్రబాబు తీరు ఒకలా ఉందని.. వైఎస్‌ చనిపోయాక చంద్రబాబు వైఖరిలో చాలా మార్పు వచ్చిందన్నారు. ఇక రాష్టాన్రికి నాయకుడ్ని తానే అని చంద్రబాబు భావించారని వ్యాఖ్యానించారు. తాను వైఎస్సార్‌సీపీలోకి వెళ్లి మంత్రి అవుతానని చంంద్రబాబుకే చెప్పానని.. నువ్వు వైసీపీలోకి వెళ్లినా.. ఆ పార్టీ ప్రభుత్వంలోకి రాదని చంద్రబాబు తనతో అన్నారని చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు రాజధానిలో పర్యటించినప్పుడు చెప్పులు వేశారని.. తనకు గతంలో జరిగిన వైశ్రాయ్‌ సంఘటన గుర్తొచ్చిందన్నారు మంత్రి. ఇక ప్రత్యేక ¬దా గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని.. జగన్‌ పిలిస్తే టీడీపీ 80శాతం ఖాళీ అవుతుందని.. తన గౌరవాన్ని చంద్రబాబు తగ్గించుకోవద్దన్నారు. ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని.. వెనక్కు తీసుకుంటే హుందాగా ఉంటుందన్నారు. ఇక చంద్రబాబు, టీడీపీ సభ్యుల వ్యాఖ్యలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే తనను ఏడాదది పాటూ సస్పెండ్‌ చేశారని.. తనను సస్పెండ్‌ చేయడం సరికాదని సుప్రీంకోర్టు అప్పుడు చెప్పిందన్నారు. హైకోర్టు ఆర్డర్‌ ఉన్నా తనను లోపలికి రాకుండా చేశారని.. తనను ఈడ్చుకెళ్లారని గతంలో జరిగిన ఘటనల్ని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడా.. పనికిమాలిన నాయకుడా అంటూ విరుచుకుపడ్డారు. పిల్లి ఎంత అరిచినా సింహం కాలేదని, చంద్రబాబు తీరు అలానే ఉందన్నారు.
చంద్రబాబుకు మానవత్వం లేదు-  సీఎం జగన్‌
ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు క్షమాపణ అడుగుతారని ఆశించడం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబుకు మానవత్వం లేదని, క్షమాపణ చెప్పడాన్ని ఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. అవాస్తవ కథనాలపై చర్యలు తీసుకునేందుకు తీసుకువచ్చిన జీవోలో ఎటువంటి తప్పులేకపోయినా టీడీపీ రాద్దాంతం చేసిందని మండిపడ్డారు. జీవోలో ఎటువంటి తప్పులేకపోయినా టీడీపీ రాద్దాంతం చేసి.. సభా సమయాన్ని వృథా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సభ్యుల వాదనపై స్పందించిన స్పీకర్‌ కమాపణలు చెప్పాలా.. వద్దా అనే విషయాన్ని ప్రతిపక్షనేతకే వదిలేస్తున్నానని.. కమాపణలు చెప్పకుంటే ఎథిక్స్‌ కమిటికి రిఫర్‌ చేస్తానని స్పీకర్‌ అన్నారు.