చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

 

౼ దోమ ఎస్సై విశ్వజన్
౼ మోత్కూర్ గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసిన 11 మంది రిమాండ్

దోమ అక్టోబరు 14(జనం సాక్షి)

చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని దోమ ఎస్ఐ విశ్వజన్ అన్నారు. శుక్రవారం దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామానికి చెందిన 25 మంది గత నెల సెప్టెంబర్ 21వ తేదీన గ్రామానికి చెందిన నందిని అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన సోహెల్ బైక్ పై నందిని ఢీకొట్టాడని, సోహెల్ ఇంటిముందు మృతదేహం పెట్టి న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడుతామని గ్రామానికి చెందిన కొందరు యువకులు మృతదేహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు వారిని ఎంత వారించినా వినకుండా, పోలిసుల విధులకు ఆటంకం కల్గించడమే కాకుండా, 108 వాహనం డోర్ విరగొట్టి మృతదేహాన్ని తీసుకెళ్లి బాధితుడు సోహెల్ ఇంటి ముందు బైటాయించేందుకు యత్నించారు. ఈ క్రమంలో మృతదేహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ఎంత కృషి చేసిన వినలేక పోయారు. అట్టి వ్యక్తులలో 25 మందిని గుర్తించి కేసులు నమోదు చేశాం. అందులో శుక్రవారం 11 మందిని రిమాండ్ చేస్తున్నామని తెలిపారు. చట్టాన్ని ఎవరు అతిక్రమించి చేతుల్లోకి తీసుకోవాలని అనుకున్నా వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.