చిన్నారుల మరణాలపై సీఎం ఆరా

హైదరాబాద్‌ : నీలోఫర్‌ సహా వివిధ ఆస్పత్రుల్లో పెరిగిన చిన్నారుల మరణాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అరా తీశారు. వీటిపై దిద్దుబాటు చర్చలను తీసుకోవాల్సిందిగా ఆరోగ్య శాఖ కార్యదర్శి అజయ్‌ సహానీకి ముఖ్యమంత్రి అదేశాలు జారీ చేశారు. నీలోఫర్‌ సహా మిగిలిన అన్ని ఆస్పత్రులను పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలని సీఎం అదేశించారు.