చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలపై కేంద్రం అఖిలపక్షం

ఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ అంశంపై ఓటింగ్‌తో కూడిన చర్చకు భాజపా, జేడీయూ, వామపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్‌ ఏ నిబంధన కింద అనుమతించినా చర్చకు సిద్ధమని సమాజ్‌వాదీ పార్టీ తెలిపింది.