చెట్టును ఢీకొని ఒకరి మృతి

కాగజ్‌నగర్‌ :పట్టణంలోని కాపువాడ ప్రధాన రహదారిపై మోటారు సైకిల్‌పై వస్తున్న దుర్గం నామ్‌దేవ్‌ (24) ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొని అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ఉంది. ఈ మేరకు స్తానిక పోలీసు కేసు నమోదు చేశారు.