చెన్నై-బెంగళూరు ఇండస్ర్టియల్ కారిడార్
టోకియో, జులై 6 : చెన్నై – బెంగళూరు ఇండస్ర్టియల్ కారిడార్ను ఏర్పాటు చే యనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనలో భాగంగా మిత్సుబుషీ కంపెనీ కృష్ణపట్నంలో క్లస్టర్ ఏర్పాటుకు ఆసక్తి చూపించింది. కృష్ణపట్నంలోనే అన్ని కంపెనీలు ఏర్పాటుచేస్తామని మిత్సుబుషీ కంపెనీ ప్రకటించింది. ఏపీలో ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లపై దృష్టి సారించాలని జపాన్ కంపెనీలను సీఎం కోరారు. ఏపీలో ఐరన్, బాక్సైట్ వంటి అపారఖనిజ సంపద ఉందని చంద్రబాబు చెప్పారు. మయావకా కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమై గోదావరి జిల్లాల్లో మత్స్య పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడారు. మత్స్య పరిశ్రమలో వృద్ధి బాగా ఉందని ఏపీలోనే ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకునేందుకు సహకరించాలని కోరారు. దీనిలో భాగంగానే ఆక్వా యూనివర్శిటీని ఏర్పాటు చేశామని చంద్రబాబు జపాన్ పారిశ్రామికవేత్తలకు వివరించారు.