చెరువును మింగుతున్న మట్టి మాఫియా

చెరువును మింగుతున్న మట్టి మాఫియా*
*అక్రమంగా తరలిస్తున్న మట్టిని అడ్డుకున్న నాయకులు*
బయ్యారం,జూన్ 13(జనంసాక్షి):
బయ్యారం మండలం వెంకట్రాంపురం గ్రామ పంచాయతీ చోక్లా తండా పరిధిలోని దొమ్మరిదాని చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలను వెంకట్రాంపురం సర్పంచ్ నీలిమ, కాంగ్రెస్ నాయకులు రాము నాయక్, ఉపసర్పంచ్ సుధాకర్ అడ్డుకున్నారు.ఈ సందర్బంగా  రాము నాయక్ మాట్లాడుతూ…బయ్యారం మండలంలో ఏజెన్సీ  ప్రాంతాల్లో కూడా కొంతమంది స్వార్థపరులు వారి స్వలాభం కోసం జీరో దందా పేరుతో ఎటువంటి అనుమతులు లేకుండా మైనింగ్ శాఖ అనుమతులు తీసుకోకుండా, స్థానిక తహసిల్దార్ అనుమతులు లేకుండా ఎంతో కాలంగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నారు. దిలీప్ అనే కాంట్రాక్టర్ ఉప్పలపాడు సమీపంలోని బ్రిడ్జి పేరు చెప్పుకొని  బయ్యారం మండలం లోని తదితర ప్రాంతాల్లో అక్రమంగా అమ్ముకుంటున్నారని,కోట్ల రూపాయల వ్యాపారం చేసుకుంటూ ఎటువంటి పర్మిషన్ లేకుండా మట్టి తవ్వకాలపై సంబంధిత అధికారులు స్పందించాలన్నారు.ఈ అక్రమాలపై ఎమ్మార్వో తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే దశలవారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.