చేనేత కార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్ల పట్టణం : ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో చోటుచేసుకుంది. గుల్ల విశ్వనాథం అనే చేనేత కార్మికుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంధన సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ 20 రోజులుగా ఆసాములు సమ్మె చేస్తుండటంతో పని విశ్వనాధం అప్పుల పాలైయ్యాడు. వాటిని తీర్చే మార్గం లేకపోవడంతో ఈ రోజు ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్ల సీఐ నాగేంద్రచారి కూసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.