చేప పిల్లలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర……

టేకుమట్ల.సెప్టెంబర్16(జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల,చిట్యాల మండలాలలోని చేప పిల్లలు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పంపిణీ చేశారు.చిట్యాల మండలంలోని నైన్ పాక,అందుకుతండా గ్రామాలలో మోడల్ డిజిటల్ విలేజ్ పథకం క్రింద ఏర్పాటు చేసుకున్న సి ఎస్ సి కేంద్రాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.