జగన్‌తో కేంద్రమంత్రి భేటీ

అమరావతి,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   ఎపి సిఎం జగన్‌ తో కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు పలు అంశాలపై చర్చించారు. ఈ బేటీ సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడకు వచ్చిన గిరిరాజ్‌ సింగ్‌ ఇంద్రకీలాద్రిపై నెలవైన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఇఒ సురేశ్‌ బాబు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని గిరిరాజ్‌  సింగ్‌ తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులు కోసం తాను వచ్చానని, దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నంతకాలం న్యాయం, ధర్మం కాపాడబడుతాయని ఆయన పేర్కొన్నారు.