‘జనంసాక్షి’ దిన పత్రిక భేష్‌:టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌

కరీంనగర్‌: నవంబర్‌ 23,(జనంసాక్షి):

‘జనంసాక్షి’ ప్రధాన కార్యలయాన్ని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ శుక్రవారం సందర్శించారు. జనంసాక్షి ఎడిటర్‌ రహమాన్‌ పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. జనంసాక్షి దినపత్రిక తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషిస్తుందని ఆయన అన్నారు. జనంసాక్షి సిబ్బందితో ముచ్చటించి అభినందించారు. అనంతరం ఆయన జనంసాక్షి వెబ్‌సైట్‌ను తిలకించారు  ప్రజసమస్యలపై స్పందించాలని     ప్రజా సమస్యలపై వార్తలను దృష్టిసారించి రాయాలని ఆకాంక్షించారు. ప్రధాన దినపత్రికలకు దీటుగా మన తెలంగాణ ప్రాంతం నుంచి  ‘జనంసాక్షి’ దినపత్రిక వెలువడటం అభినందనీయమన్నారు.