జనం గుప్పిట్లో జీహెచ్‌ఎంసీ

5 copy

– సేవలన్నీ పారదర్శకం

– యాప్‌ విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,జులై 15(జనంసాక్షి): నగర పౌరులకు ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌ అందుబాటులోకి వచ్చింది.  జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే.తారకరామారావు ఈ యాప్‌ను శుక్రవారం ఉదయం  లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్‌ ద్వారా పౌరులు తమ సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లవచ్చన్నారు. నగరంలో సమస్యలపై ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కేటీఆర్‌ తెలిపారు. ‘మై జీహెచ్‌ఎంసీ యాప్‌’తో ప్రజల