జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోరెడ్డి మాల్లారెడ్డికె వరిస్తుందా …జనగామ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో గుసగుసలు

పోరెడ్డి మల్లారెడ్డి కి కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్ష పదవి వరిస్తుందని జనగామ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల్లో హాట్ టాపిక్ గా మారింది .ఈ పదవి కోసం పలువురు జిల్లా నాయకులు పోటీ పడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి అయితే మరికొందరు నేతలు సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ,సొంత వారే మోసం చేస్తూ కాంగ్రెస్ పార్టిలో గ్రూపు రాజకీయాలతో బ్రష్టు పట్టిస్తున్నరానే ఆరోపణలు వస్తున్న తరుణంలో రాష్ట్ర హైకమాండ్ కు నిర్ణయం తీసుకోవడం కత్తిమీద సాములాంటిదే అని భావిస్తున్నారు .ప్రజలతో కార్యకర్తలతో కలుపుకొనిపోయే నాయకుడినే అధ్యక్ష పదవి కట్టబెట్టాలని యోచనలో కాంగ్రెస్ రాష్ట్ర హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుండి బూత్ లెవల్ కార్యకర్తలనుండి జిల్లా నాయకుల అభిప్రాయలను తెలుసుకొని జిల్లా అధ్యక్ష పీఠం ప్రజాధారణ సేకరణ అనంతరం వారికే కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు భావిస్తున్నారు. అవకాశం వస్తే పార్టీ కోసం పనిచేసే నాయకుల్లో ముందుండే నాయకులలో గతంలో పనిచేసిన అధ్యక్షులు పార్టీ బాధ్యతల నుంచి వెళ్లడం పోరెడ్డి మాల్లారెడ్డి కి కలిసొచ్చే అవకాశంగా ఉందని రేవంత్ రెడ్డి మనిషిగా ముద్ర ఉండటం , పార్టీ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తు గత ఒక ఏడాదిగా పార్టీ సభ్యత్వ నమోదు మూడు నియోజకవర్గాల్లో పని చేయడం ఏ వర్గం సహకరించకపోయినా పార్టి ఆదేశా లా మేరకు నిశ్శబ్దంగా తన పని జనగామ జిల్లాలో చాకచక్యంగా చేసుకొని పార్టీలో చురుకుగా పని చేయడం మూడు నియోజకవర్గా లో సూపరిచితుడుగా ఉండడం ,ముక్యంగా స్థానికులు కావడంతో పోరెడ్డి మల్లారెడ్డి కి కలిసివస్తాయని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు.