జర్నలిస్ట్ పై దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన జర్నలిస్టులు

కొత్తగూడ అక్టోబర్ 11 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడెంలో జర్నలిస్ట్ పల్లె సురేష్ పై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దారవత్ రమేష్ చేసిన దాడికి నిరసనగా కొత్తగూడ,గంగారం మండలాల జర్నలిస్టులు అంబేద్కర్ సెంటర్ వద్ద నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు.బీట్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.