జాతీయస్థాయి అవార్డు పొందిన రాష్ట్ర నాయకుడు బొల్లం మల్లేశం ను: ఘనంగా సన్మానించిన జిల్లా మండల అధ్యక్షులు

జాతీయస్థాయి అవార్డు పొందిన రాష్ట్ర నాయకుడు బొల్లం మల్లేశం ను: ఘనంగా సన్మానించిన జిల్లా మండల అధ్యక్షులు

ధర్మపురి (జనం సాక్షి) ధర్మపురి మాలల ఐక్యవేదిక మండల అధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్ హెచ్ ఫంక్షన్ హాల్లో ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సూరమళ్ళ సతీష్, జిల్లా అధ్యక్షురాలు దేవి అంజలి ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక అధ్యక్షుడు బొల్లం మల్లేశం కు ఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్ ఆడిటోరియంలో అంబేద్కర్ స్పెషల్ జాతీయ అవార్డునుపొందారంటూ.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పర్యటించి మాలలను ఒకతాటిగా నడిపిస్తూ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో అనేక కార్యక్రమాలు చేపట్టడంతో ఈ జాతీయ అవార్డు పొందారు. ఢిల్లీలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన నాల్గవ ఆల్ ఇండియా బహుజన రైటర్స్ కాన్ఫరెన్స్ లో వివిధ రంగాలలో విశేషంగా కృషి చేసిన వారికి జాతీయ అవార్డులు ప్రధానం చేశారని ఆయన తెలిపారు. సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షుడికి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సూరమల్ల సతీష్, జిల్లా అధ్యక్షురాలు దేవి అంజలి,గొల్లపల్లి మండల అధ్యక్షుడు పొనగంటి రాజా రత్నం,ఎండపల్లి మండల అధ్యక్షుడు రెడ్డిమల్ల తిరుపతి, గంధం కిరణ్,కేడం మంగ అధ్యక్షురాలు, ముత్తూర్ల జమున మండల అధ్యక్షురాలు,ఆట అశోక్, జక్కుల శంకర్, కుంభాల రవితేజ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు