జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డ్ అందుకున్న దాసరి శంకరయ్య

జనంసాక్షి, రామగిరి : దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బహుజన్ రైటర్స్ కాన్ఫరెన్స్ లో చందనపూర్ సర్పంచ్ దాసరి శంకరయ్య కి జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డ్ అందుకున్నారు. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధా కృష్ణ చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు.ఈ కార్యక్రమంలో న్యూ ఢిల్లీ రాష్ట్ర కేబినెట్ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్, కరోల్ బాగ్ ఎమ్మెల్యే విశేష్ రవి, బహుజన సాహిత్య అకాడమీ జాతీయ ప్రధాన కార్యదర్శి డా. యూ.సుబ్రమనియన్, ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షులు మాన్విర్ సింగ్ పర్చ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు యం. యం. గౌతమ్ అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ బుపెల్లి జ్యోతి, చందనపూర్ గ్రామ ఉప సర్పంచ్, నడిపెళ్ళి సాగర్ రావు పాల్గొన్నారు.