జిల్లాలో జోరుగా రేషన్ దందా..

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో జోరుగా రేషన్ దందా సాగుతుంది.కొందరు వ్యాపారాలు పాత జినింగ్ మిల్లులను అడ్డాగా చేసుకొని రేషన్ దందకు తెరతీస్తున్నారు.ప్రభుత్వం పేదలకు ఉచిత బియ్యం అందిస్తున్న సంగతి తెలిసినదే. దీనిని కొంత మంది ఆసరాగా చేసుకొని నెలకి లక్షలలో సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్ డీలర్ లు రేషన్ కార్డు దారుల నుండీ రూ,8 నుండి పది రూపాలతో కొని రేషన్ మాఫియాకు అమ్ముతున్నారు. వారు అటునుండీ మహారాష్ట్ర కు 19 రూపాయలకు కిలో చొప్పున అమ్మి లక్షలో ప్రభుత్వ అదయానికి గండి కొడుతున్నారు.మధ్యాహ్నం మరియు రాత్రి వేళలో ఆటోలలో తరలిస్తున్న అటు వైపుగా చూసి చుడనట్లుగా వ్యవహారిస్తున్నారు అధికారులు. అధికారుల తిరూ పై పలు విమర్శలు వెల్లువే త్తుతున్నాయి.ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన అధికారులే తమకేమి తెలియదు అన్నట్లుగా వ్యవహరించడం జిల్లాలో ఇప్పుడు చర్చనియా అంశాంగా మారింది.