జిల్లాస్థాయి జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు సైన్స్ పెర్

వనపర్తి జిల్లా కేంద్రంలో సూర్యచంద్ర హైస్కూల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు సైన్స్ ఫెర్ నిర్వహించడం జరిగింది.గణిత ప్రదర్శనలో రాణించినటువంటి విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ,హాజరై విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ  సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ, అత్యంత వైభవితంగా జిల్లా స్థాయి జన విజ్ఞాన ప్రదర్శన నిర్వహించిన విద్యా శాఖకు అభినందనలు, తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీసి అత్యంత అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చారని, కొనియాడారు.”మున్సిపాలిటీ “తడి చెత్త పొడి చెత్త” పై గోపాల్ పేట విద్యార్థులు చేసిన ప్రదర్శనను ఆకట్టుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్, ఆ విద్యార్థులక  ప్రత్యేకంగా సన్మానం, చేయించారు.కార్యక్రమంలో చంద్రశేఖర్,గణేష్,శ్రీనివాసులు, ఎంఈఓ. శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.