జిల్లాస్థాయి లో ఉత్తమ ప్రతిభని కనబరిచిన పంజుగుల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కాంపల్లి వర్ణ ,కాంపల్లి శ్రీనిధి

కల్వకుర్తి పట్టణంలోని సిబిఎం కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆటల పోటీలలో జిల్లాలోని కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో ఆటల పోటీలలో పాల్గొనడం జరిగింది. అందులో పంజుగుల గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కాంపల్లి వర్ణ ,మూడవ తరగతి అమ్మాయి లాంగ్ జంప్ లో జిల్లాస్థాయి మొదటి బహుమతిని గెలుచుకున్నారు. అదేవిధంగా జిల్లాస్థాయి 300 మీటర్ల రన్నింగ్ పోటీలలో శ్రీనిధి మూడవ తరగతి రెండవ బహుమతి తో రెండవ స్థానంలో నిలవడం జరిగింది. ఈ విద్యార్థులను వచ్చే నెలలో గచ్చిబోలి హైదరబాద్ లో జరగబోయే రాష్ట్రస్థాయి ఆటల పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభను కనబడచడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్లయ్య గౌడ్,  తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్,విద్యార్థుల తల్లదండ్రులు రాములు, లక్ష్మయ్య మరియు పాఠశాల బృందం హర్షం వ్యక్తం చేశారు