జులైలో ఆస్టేల్రియా పర్యటనకు టీమిండియా

– షెడ్యూల్‌ను విడుదల చేసిన క్రికెట్‌ ఆస్టేల్రియా

మెల్‌బోర్న్‌, జ‌నం సాక్షి ) : ఈ ఏడాది కోహ్లీసేన వరుసగా టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లతో బిజీగా గడపనుంది. ఐపీఎల్‌ అనంతరం టీమిండియా వన్డే, టీ20, టెస్టు సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లాండ్‌ వెళ్లనున్న విషయం తెలిసిందే. జులైలో ఈ పర్యటన ప్రారంభం కానుంది. తాజాగా క్రికెట్‌ ఆస్టేల్రియా 2018-19కి సంబంధించి ఆసీస్‌ ఆడే క్రికెట్‌ మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది. 2018 నవంబరు 21 నుంచి 2019

జనవరి 18 వరకు భారత్‌-ఆసీస్‌ మధ్య టీ20, టెస్టు, వన్డే సిరీస్‌లు జరగనున్నట్లు పేర్కొంది. ఈ పర్యటనలో భారత్‌ ఆతిథ్య ఆసీస్‌తో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. పర్యటనలో టీ20 సిరీస్‌తో భారత్‌ తన పర్యటనను ప్రారంభించనుంది.

షెడ్యూల్‌..

మొదటి టీ20: నవంబరు 21(గబ్బా), రెండో టీ20 నవంబరు 23( మెల్‌బోర్న్‌), మూడో టీ20 నవంబరు 25( సిడ్నీ), మొదటి టెస్టు డిసెంబరు 6(ఆడిలైట్‌), రెండో టెస్టు డిసెంబరు14న(పెర్త్‌), మూడో టెస్టు డిసెంబరు 26(మెల్‌బోర్న్‌ బాక్సింగ్‌ డే టెస్టు), నాలుగో టెస్టు జనవరి 3(సిడ్నీ), మొదటి వన్డే జనవరి 12(సిడ్నీ), రెండో వన్డే జనవరి 15(ఆడిలైట్‌), మూడో వన్డే జనవరి 18( మెల్‌బోర్న్‌), మూడు సిరీస్‌ల్లో ఆసీస్‌ ఆటగాళ్లు స్మిత్‌, వార్నర్‌ ఆడలేరు. బాల్‌ టాంపరింగ్‌ వివాదం కారణంగా వీరిద్దరిపై విధించిన 12 నెలల నిషేధం 2019 మార్చిలో ముగియనుంది. దీంతో వీరు ఈ సిరీస్‌కు దూరం కానున్నారు. ఇదే వివాదంలో 9 నెలల నిషేధం ఎదుర్కొంటున్న బాన్‌క్రాఫ్ట్‌ భారత్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడు.