జూలపల్లి లో గడపగడపకు కాంగ్రేస్ ప్రచారం

జూలపల్లి లో గడపగడపకు కాంగ్రేస్ ప్రచారం

జనంసాక్షి , కమాన్ పూర్ : ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి, మంథని ఎంఎల్ఎ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కమాన్ పూర్ మండలంలోనీ జులపల్లి గ్రామములో తెలంగాణ కాంగ్రేస్ ఆరు గ్యారంటీ పధకాలను గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ, యువ వికాస, చేయూత పథకంను అమలు చేస్తుందని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జెమినీ గౌడ్, ఎంపీటీసీ సభ్యులు షెవ్వ శంకరయ్య,జూలపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు బూస తిరుపతి,మాజీ అధ్యక్షులు రాజిరెడ్డి, సీనియర్ నాయకులు గడ్డం బాపు, ముత్యం తిరుపతి, మదనయ్య,జంగిల్ కుమార్, సందెవేళ నాగరాజు, ముత్యం సతీష్, నిఖిల్, రవి, మారుతి గౌడ్ తదితరులు ఉన్నారు.