టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలి.

టిఆర్ఎస్ పార్టీ  పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు .
తాండూరు నవంబర్ 25(జనంసాక్షి) టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలని
పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు పేర్కొన్నారు.
శుక్రవారం తాండూరు మండల టీఆరెస్ బీసీ అనుబంధ కమిటీ నూతన అధ్యక్షులుగా నియమితులైన చంద్రశేఖర్ గౌడ్ కు తన కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ  పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం  చుట్టుతామని వెల్లడించారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలోనే తాండూర్ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు దూసుకు పోతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తాండూరు పట్టణాన్ని  ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని తెలిపారు.ఈ కార్యక్రమంలో చెన్ గెష్ పూర్  హనుమాన్ దేవాలయ ఛైర్మెన్ ప్రశాంత్ గౌడ్, సీనియర్ నాయకులు ప్రవీణ్ గౌడ్,తాండూరు మండల యూత్ అధ్యక్షుడు రాజు గౌడ్ మరియు నాయకులు పాల్గొన్నారు