టిటిడి బోర్డు పదవికి సండ్ర రాజీనామా

ఖమ్మం,నవంబర్‌22(జ‌నంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యత్వానికి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రాజీనామా చేశారు. టీటీడీ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన రాజనీమా చేశారు. రాజీనామాను టిటిడి బోర్డు ఆమోదించింది. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అయితే… టీటీడీ పాలకమండలి సభ్యుడిగా కొనసాగితే నామినేషన్‌ తిరస్కరించే అవకాశం వున్న

నేపధ్యంలో టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి సండ్ర రాజీనామా చేశారు. దీంతో టీటీడీతోపాటు, ఏపీ ప్రభుత్వం వెంకటవీరయ్య రాజీనామాను ఆమోదించింది. ఇటీవల మరోమారు ఆయనకు టిటిడి బోర్డు పదవిని కట్టబెట్టారు. గత ఎన్నికల్లో సండ్ర సత్తుపల్లి నుంచి గెలుపొందారు.