టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభర్యర్థిగా మహమూద్
హైదరాబాద్్, మార్చి 7 (ఎపిఇఎంఎస్): తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా మహమూద్ ఆలీ గురువారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకుగాను మహమూద్ ఆలీ రంగంలోకి దిగారు. నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్,ఎమ్మెల్సీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం మీడియాతో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మహమూద్ ఆలీ ఎన్నికకు సహకరించాలని ఎమ్మెల్యే నాగం జనార్ధనరెడ్డిని,మరికొందర్ని అడిగామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే అవకాశం ఉందన్నారు. అలాగే ఎమ్మెల్సీ అభ్యర్ధి మహమూద్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుకు రుణపడి ఉంటానని అన్నారు.